హైదరాబాద్: టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో భూకంపం సంభవించింది. నేటి వేకువజామున 4:34 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఇదే తీవ్రతతో రెండు సార్లు భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. తరువాత పలు మార్లు ప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. వేకువ జామున కావడంతో నిద్రలో ఉన్నకారణంగా పలువురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చైనాలో సహయకచర్యలు ప్రారంభమయ్యాయి. భూకంప కేంద్రం నింగ్చి అనే ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. భూగర్భంలోని పది కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో అతితక్కువ మానవసంచారం ఉంటుందని, దీంతో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉందని చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm