సంగారెడ్డి: జిల్లాలోని అమీన్పూర్ మండలం గండిగూడ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు మణికంఠ, కృష్ణమూర్తి, సుబ్బారావుగా గుర్తించారు. మణికంఠ, కృష్ణమూర్తి తమిళనాడు వాసులు కాగా, సుబ్బారావు చింతల్వాసి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm