హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ సీబీఐ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది నాలుగు ఛార్జ్ షీట్లపై డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలంటూ నిన్న విచారణ సందర్భంగా జడ్జిని కోరారు. దీంతో, ఆయనపై జడ్జి సీరియస్ అయ్యారు. గత రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారని... ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారంటూ మండిపడ్డారు. మీరు వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయానంటూ అసహనం వ్యక్తం చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని... ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు... ఇకపై ఇలాంటివి కుదరవు అంటూ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm