చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువులను లక్ష్యంగా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా జయటీవీ, శశికళ బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం జయలలితకు చెందిన పోయెస్గార్డెన్లోని వేద నిలయంలో తనిఖీలు నిర్వహించారు. మద్రాసు హైకోర్టు నుంచి అనుమతులు తీసుకున్న అనంతరం శుక్రవారం రాత్రి ఐటీ అధికారులు పోయెస్ గార్డెన్ చేరుకున్నారు. అక్కడ జయలలిత పీఏ పూంగుండ్రన్, శశికళ గదుల్లో సోదాలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm