హైదరాబాద్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రంలో భానుమతిగా నటించి మెప్పించిన మలయాళీ బ్యూటీ సాయిపల్లవి. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ఇక ఇందులో సాయి పల్లవి నటనకి తెగ ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు ఈ అమ్మడి సినిమా అంటే మనసు పారేసుకంటున్నారు. ఈ క్రమంలో ఓ మలయాళ చిత్రం తెలుగులో డబ్బింగ్ జరుపుకొని హేయ్ పిలగాడ అనే టైటిల్తో విడుదలకి సిద్ధమైంది. ఇక నాని సరసన కథానాయికగా ఎంసీఏ చిత్రంలో నటిస్తుంది సాయి పల్లవి. ఈ మూవీ డీసెంబర్ 21న విడుదల కానుంది. కట్ చేస్తే సాయిపల్లవి ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కబోయే ప్రయోగాత్మక చిత్రం కణంలో లీడ్ రోల్ లో నటిస్తోంది. ఎ. ఎల్ విజయ్ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2.0 నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ఇది అభిమానులకి ఎంతగానో నచ్చేసింది. ట్రైలర్ తో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీతోను సాయి పల్లవి ఫిదా చేస్తుందని అంటున్నారు. హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్నది. తమిళ్లో కరు టైటిల్తో రిలీజ్ కానుంది. ఈ మూవీతోనే సాయిపల్లవి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో కణం తెరకెక్కుతున్నది. ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో నటిస్తోందట.
Mon Jan 19, 2015 06:51 pm