హైదరాబాద్: విద్యుత్శాఖ అధికారులతో శనివారం తెలగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా అంశంపై చర్చించారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడంలో సంస్థలు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నాం. ఎత్తిపోతల, మిషన్ భగీరథ, పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ కోసం సరైన ప్రణాళిక రూపొందించాలి. సరఫరాను వ్యవసాయం, ఎత్తిపోతల, మిషన్భగీరథ, వాణిజ్యం, పారిశ్రామిక, నివాస రంగాలుగా విభజనకు ఏర్పాట్లు చేసుకోవాలి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని రూ.4,777 కోట్ల నుంచి రూ.5,400 కోట్లకు పెంచుతున్నాం.మిషన్భగీరథ, ఎత్తిపోతలకు 10 నుంచి 12వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. విద్యుత్శాఖ పనితీరు వల్ల రాష్ట్రానికి ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ స్ఫూర్తిని ఇలానే కొనసాగించి నాణ్యమైన విద్యుత్ అందించాలి్ణ్ణ అని సీఎం కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm