వరంగల్: కాకతీయ డిగ్రీ కాలేజి మైదానంలో టీఆర్ఎస్ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని, హైదరాబాద్-వరంగల్ మధ్య మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్దరిస్తామని కేటీఆర్ అన్నారు. వరంగల్లో అధునాతన క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు. వరంగల్కు టూరిజం ప్యాకేజి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని మంత్రి తెలిపారు. పసలేని పనిలేని కాంగ్రెస్ దద్దమ్మల ఆరోపణలు పట్టించుకోవదన్నారు. కాంగ్రెస్ను పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమని కేటీఆర్ విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm