హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు 50 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం 16 రోజులకే ముగించేందుకు ప్రతిపక్షాలతో సంప్రదింపులు చేస్తున్నారని శాసనసభలో బీజేపీ పక్ష నేత కిషన్రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ సమావేశాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సభలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పొగిడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. ముఖ్యమంత్రి నిజాంను పొగిడారని ఎద్దేవా చేశారు. నిజాం చరిత్రను తిరగరాస్తానని సీఎం శాసనసభలో ప్రకటిస్తే మరోవైపు మజ్లిస్ పార్టీ సీఎంను పొగిడిందన్నారు. నిజాం చరిత్ర నేటితరానికి తెలియాలంటే ఆనాడు తెలంగాణ ప్రజలు, రైతులపై నిజాం ప్రభుత్వం సాగించిన దోపిడీ, దాష్టీకాల గురించి, నిజాం రజాకార్లను ఎదిరించేందుకు ప్రజలు నిర్మించుకున్న బురుజుల గురించి కూడా సీఎం తాను రాయించబోయే చరిత్రలో పొందుపర్చాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm