హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఇటీవలే ఓ ఇంటి యజమాని, కూలీలపై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ సదరు కార్పొరేటర్కి బుద్ధి రాలేదు. వైన్ షాప్ టెండర్లకు సంబంధించి తెలంగాణ సర్కారు ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో తన కొడుకు యశ్వంత్ రెడ్డి పేరు మీద మూసారాంబాగ్లో ఒక వైన్స్ షాప్ను దక్కించుకున్న విఠల్ రెడ్డి.. మరో లిక్కర్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి వ్యాపారం కొనసాగిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మళ్లీ ఇవ్వడం లేదు. అంతేకాదు, తన కుమారులు, తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. భాస్కర్ రెడ్డి ఇంటిపై రెక్కీ నిర్వహించి, నిన్న రాత్రి విజయ్భాస్కర్ రెడ్డిపై దాడి చేయించాడు. డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని కేసు పెడతావా? అంటూ కొట్టారు. కార్పొరేటర్ విఠల్రెడ్డి, అతని కుమారులతో తనకు ప్రాణభయం ఉందని భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm