కర్ణాటక : 16 సంవత్సరాల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిందనే ఆరోపణలపై ఓ యువతిపై కర్ణాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆ బాలుడిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిందంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ యువతి వయస్సు 24 సంవత్సరాలు. ట్విస్టేమిటంటే.. ఆ యువతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారట. బాధిత బాలుడు, ఆ యువతి ఇద్దరూ కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 24వ తేదీ నుంచి ఆ బాలుడు, ఆ యువతీ ఇద్దరూ అదృశ్యమయ్యారు. తన భార్య కనిపించట్లేదంటూ అదే రోజు రాత్రి ఆ యువతి భర్త కేజీఎఫ్లోని రాబర్ట్సన్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం ఆ బాలుడి తండ్రి కూడా అదే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడి తండ్రి పోలీస్స్టేషన్కు వచ్చిన సమయంలో.. ఆ యువతి ఫొటోలను పోలీసుల చేతుల్లో చూశాడు. ఏం జరిగిందంటూ పోలీసులను ప్రశ్నించాడు. దీనితో ఆ యువతి కూడా గత రాత్రి నుంచి కనిపించట్లేదంటూ తెలిపారు. దీనితో షాక్కు గురైన ఆ తండ్రి.. ఇద్దరూ కలిసే పారిపోయి ఉంటారని స్పష్టం చేశాడు. వారిద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందని చెప్పాడు.
పోలీసులు కేజీఎఫ్లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. బస్స్టాండ్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఇద్దరూ కనిపించారు. ఓ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. తమిళనాడులోని వేళాంకిణిలో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 18,2017 07:58PM