హైదరాబాద్ : హిందూ మతంలో ఒకరు (బ్రాహ్మణులు) ఆధ్యాత్మిక రంగాన్ని మరొకరు (ఆర్యవైశ్యులు) వ్యాపార రంగాన్ని శాసిస్తున్నారని ప్రొ.కంచ ఐలయ్య అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... పూజారి అయ్యే హక్కు ఎవరికి ఉండదో వారు ఆ మతంలో ఉన్నట్లు కాదని హిందూ మతాన్ని ఉద్దేశించి అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే అన్ని వర్గాల వారికి మతంలో సమానత్వం కావాలని అన్నారు. హిందువుగా పుట్టిన తనకు తిరుపతిలోని హిందు దేవుడి వద్ద పూజారి అయ్యే హక్కు లేదని కంచ ఐలయ్య అన్నారు. హిందూ మతంలో ఉన్న వారందరికీ పూజారి అయ్యే హక్కు ఉండాలని ఐలయ్య అన్నారు. బ్రాహ్మణులకు మాత్రమే పూజారయ్యే హక్కు ఉంటే వారు మాత్రమే హిందువులని వ్యాఖ్యానించారు. నేను హిందువుని ఎట్లైతా? అని అందుకే ఆ పుస్తకం రాశానని అన్నారు. ఇక్కడి కుల వ్యవస్థ వల్లే మతమార్పిడిలు జరుగుతున్నాయని, ఇప్పుడు కేవలం భారత్, నేపాల్లో మాత్రమే హిందు మతం బతికి ఉందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm