హైదరాబాద్ : నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కాగా, సొరంగం పనులు జరిగే ప్రాంతంలో టిప్పర్ బోల్తా పడటంతో పదిమందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాయాలపాలైన వారిని చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటనలో గాయపడిన వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు పరామరశించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల బీమా సొమ్ము చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, గాయపడ్డ కూలీలకు వైద్య ఖర్చులతోపాటు రూ.2లక్షలు చెల్లించాలని గుత్తేదారును మంత్రి ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm