రంగారెడ్డి : నందిగామ మండలం మామిడిపల్లిలోలోని సింబయాసిస్ యూనివర్సిటీలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను విద్యాసాగర్రావు ప్రారంభించారు. ప్రపంచమంతా విద్యపైనే కేంద్రీకృతమైందని విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మహిళలు విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు మానసిక ప్రశాంతత అవసరం. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలని గవర్నర్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm