కోల్ కతా: భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా శ్రీలంక తన మొదటి ఇన్నింగ్స్ లో122 పరుగుల ఆధిక్యం లభించింది. ఆదివారం 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. మరో 35 పరుగులు జోడించిన తరువాత డిక్ వెల్లా(35) వికెట్ ను కోల్పోయింది. అటు స్వల్ప వ్యవధిలో ఆపై దాసున్ షనక(0), చండిమాల్ (28)సైతం అవుటయ్యారు ఈ మూడు వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడంతో అప్పటి వరకూ పటిష్ట స్థితిలో కనిపించిన లంకేయులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. ఆ తరుణంలో హెరాత్ బాధ్యతాయుతంగా ఆడాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో 67 పరుగులు జోడించాడు. తొమ్మిదో వికెట్ కు 46 పరుగులు జోడించిన తరువాత హెరాత్ పెవిలియన్ చేరాడు. ఆపై లక్మాల్(16) కూడా అవుట్ కావడంతో శ్రీలంక జట్టు83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ, భువనేశ్వర్ కుమార్ లు తలో నాలుగు వికెట్లతో రాణించగా, ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి.
Mon Jan 19, 2015 06:51 pm