కోల్కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో 172 పరుగుల స్వల్ప స్కోర్కే ఆలౌట్ అయిన భారత జట్టుకి శ్రీలంక జట్టు 122 పరుగుల ఆధిక్యాన్ని ముందుంచింది. కాగా రెండు ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఓపెనర్లు కేఎల్ రాహుల్(36), శిఖర్ ధావన్(33) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. దీంతో భారత్ లంకపై ఆధిక్యం సాధించేందుకు మరో 68 పరుగులు చేయాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm