హైదరాబాద్ : కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్లు రాహుల్,శిఖర్ ధావన్ భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. రాహుల్, ధావన్ లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 83 బంతులు ఆడిన రాహుల్ 60 పరుగులు, 78 బంతులు ఆడిన ధావన్ 55 పరుగులు పూర్తి చేశారు. 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. కాగా, ఓపెనర్లు రాహుల్, ధావన్ హాఫ్ సెంచరీలతో అభిమానులు సంతోష పడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm