హైదరాబాద్ : కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన ఇంటూరి రాజగోపాల్, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి రవి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదని రవితో రాజగోపాల్ వాగ్వాదానికి దిగాడు. అయితే, రాజగోపాల్ తనను కొట్టడంతో గాయాలయ్యాయంటూ రవి ఆసుపత్రిలో చేరాడు. ఈ వివాదం నేపథ్యంలో జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm