సిద్దిపేట: బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్)గా సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట జిల్లాలో 26 రోజుల్లో 26,294 మరుగుదొడ్లను నిర్మించి, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 19న) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినం సందర్భంగా మంత్రులు హరీశ్రావు, నాయిని నర్సింహారెడ్డి సిద్దిపేటను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. ఆరోగ్యవంతమైన, హరిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm