కోల్కతా: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శంక బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తం 116 బంతులు ఎదుర్కొన్న ధవన్ 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. ప్రస్తుతం భారత్ వికెట్ నష్టానికి 166 పరుగులు చేసి శ్రీలంక కంటే 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రీలంక 294 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆచితూచి ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలో లోకేశ్ రాహుల్ (71), ధవన్లు కలిసి 166 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Mon Jan 19, 2015 06:51 pm