హైదరాబాద్ : భద్రాచలం ఆలయంలో కొన్ని రోజుల క్రితం చిన్నశిల విరిగిపడిన సంఘటన మరువకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. రాజగోపురం పైనుంచి సింహపు విగ్రహంలో కొంత భాగం విరిగిపడింది. దీంతో, భక్తురాలి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోఇటీవల చిన్నశిల విరిగిపడిన ప్రాంతాన్ని పురావస్తు శాఖ అధికారులు సందర్శించి పలు సూచనలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm