హైదరాబాద్ : తెలంగాణలో దొరలపాలనకు చరమగీతం పాడేందుకు మరో ఫ్రంట్ పురుడు బోసుకుంటోంది. ప్రజాసంఘాలు, పార్టీలతో త్వరలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సామాజిక న్యాయం సాధించే వరకు రాజకీయ ఫ్రంట్ కొనసాగాలన్నదే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం వైఫల్యాల వల్ల రాజకీయ శూన్యత ఏర్పడిందని..ఆ గ్యాప్ను రాజకీయ ఫ్రంట్ పూర్తిచేస్తుందన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమాస్ఫోరం ఆధ్వర్యంలో..రాజకీయ ఫ్రంట్ సన్నాహాక సమావేశం జరిగింది. సామాజిక న్యాయం కూడా ఓ రాజకీయ అంశమే అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm