హైదరాబాద్: బంగారు తెలంగాణ కాదు.. బంగారు భారత్వైపు అడుగులు వేద్దామని నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ప్రతి విషయంలోనూ అప్డేట్ అవుతున్న ప్రజలు ప్రకృతి నుంచి దూరంగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత... ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఆ సంస్థ చేపట్టిన ాాస్పిరిట్ ఆఫ్ లైఫ్్ణ్ణ ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు పర్యాటకకార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రముఖ సినీనటి గ్రేసిసింగ్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm