తిరుపతి: తిరుమల స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీ తగ్గడంతో త్వరగా స్వామి వారి దర్శనభాగ్యం కలుగుతున్నది. స్వామి వారి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. నిన్న 78,496 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న 29,968 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.82 కోట్లు.
Mon Jan 19, 2015 06:51 pm