హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి అస్బెస్టాస్ కాలనీలో గత అర్ధరాత్రి విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కిన ఆ యువకుడు విద్యుత్ షాక్కు గురవ్వడంతో స్తంభం మీది నుంచి కింద పడ్డాడు. యువకుడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm