బెంగళూరు: ద్విచక్ర వాహనమైన రాయిల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్)పై ఏకంగా 58 మంది ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం బెంగళూరు యలహంకలోని భారతీయ వాయుసేన ఎయిర్బేస్ ఇందుకు వేదికైంది. ఏఎస్సీ టోర్నడోస్ విభాగానికి చెందిన సిబ్బంది.. 500 సి.సి. సామర్థ్యం కలిగిన పాత బుల్లెట్పై 1200 మీటర్లు ప్రయాణించారు. తొంభై దశకంలో 26 మంది సాహసికులు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసి మొదటిసారిగా రికార్డు నెలకొల్పారు. వారి రికార్డును 2010లో 54 మంది ఒకే బైకుపై ప్రయాణించి అధిగమించారు. ఆదివారమిక్కడ ఏఎస్సీ టోర్నడోస్ విభాగ సిబ్బంది నిర్వహించిన సాధనతో 2010 నాటి రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. కెప్టెన్ భిన్నశర్మ నేతృత్వంలో సుబేదార్ రామ్పాల్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రాయిల్ ఎన్ఫీల్డ్ వాహనంపై 58 మంది సిబ్బంది ప్రయాణం చేశారు. తెలుపు, ఆకుపచ్చ శిరస్త్రాణాలు, శ్వేత, హరితం, కాషాయ సమ్మేళనాల దుస్తులను ధరించి వీరు.. రన్వేపై కిలోమీటరు పైగా ప్రయాణంచడంతో ఈ నూతన రికార్డు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm