రంగారెడ్డి: జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి గేటు సమీపంలో గత అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న జీపు.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ప్రకాశం జిల్లా విశ్వనాధపురం వాసులుగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm