తూర్పుగోదావరి : జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కాకినాడ నుండి రాజమండ్రికి వెళ్తోంది. మార్గంమధ్యలో అనపర్తిలో ఎదురుగా వస్తున్న ధాన్యం లారీని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. 11 మంది ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్లు గాయపడ్డారు. మూడు క్రేన్లతో మూడు గంటలు శ్రమించి బస్సును వెలికితీశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధితులు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm