హైదరాబాద్ : నమ్మినవారికే మాయమాటలు చెప్పి మోసాలు చేస్తున్న ఈ కాలంలో నిజాయితీ గల ఓ బస్సు కండక్టర్ బస్సులో పొగొట్టుకున్న పర్సు, నగదును తిరిగి బాధితుడికి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... మణికొండ గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్సు డిపోలో కండక్టర్. ఉద్యోగంలో భాగంగా ఉప్పల్ నుంచి లింగంపల్లి వరకు వస్తున్న తన బస్సులోని సీటుపై పర్సు పడి ఉంది. బస్సు డిపోకు చేరుకోగానే విషయాన్ని గమనించిన కండక్టర్ మధు పర్సును తీసుకుని పరిశీలించాడు. అందులో రూ.8వేల నగదు, ఏటీఎం, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. పర్సులో ఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా కండక్టర్ మధు నిజాయితీగా ఫోన్చేసి వివరాలు కనుకున్నాడు. పర్సు పొగొట్టుకున్న వ్యక్తి మణికొండ పంచవటికాలనీకి చెందిన మురళీమనోహర్గా గుర్తించాడు. ఆదివారం మణికొండకు చేరుకున్న మధు మురళీ మనోహర్కు పర్సు, ఏటీఎం, క్రెడిట్ కార్డులను గ్రామసర్పంచ్ నరేందర్రెడ్డి సమక్షంలో అప్పగించారు. నిజాయితీగా కండక్టర్ సేవలపై స్థానికులు హర్షం వ్యక్తంచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm