ముంబయి: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ నేపథ్యంలో టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథా్ణ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే క్యాంపెయిన్ నేపథ్యంలో మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్్ణ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం వరల్డ్ టాయ్లెట్ డేను పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఫస్ట్లుక్లో టాయ్లెట్ బొమ్మ గీసున్న ఓ గోడ పక్కన ఓ తల్లి తన కుమారుడిని ఆప్యాయంగా పట్టుకున్నట్లుగా చూపిస్తూ ప్రతి ఇంట్లో టాయ్లెట్ తప్పనిసరిగా ఉండాలన్న సందేశాన్ని ఇస్తున్నట్లు ఉంది.
ముంబయికి చెందిన ఓ నలుగురు పేద విద్యార్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. వారిలో ఓ బాలుడు తన తల్లి కోసం టాయ్లెట్ నిర్మించాలనుకుంటాడు. ఈ విషయంలో ప్రధాని సాయం కోరుతూ ఆయనకి లేఖ రాస్తాడు. ఈ చిత్రంలో మరాఠీ నటి, జాతీయ అవార్డు గ్రహీత అంజలి పథక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 20,2017 10:53AM