కోల్కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఐదో వికెట్ నష్టపోయింది. జట్టు స్కోరు 249 వద్ద రవీంద్ర జడేజా (9బీ 41 బంతుల్లో 1ఐ4) ఔటయ్యాడు. దిల్రువాన్ పెరీరా వేసిన 65.5వ బంతిని జడేజా ఆడాడు. బ్యాట్ చివరికి తగిలిన బంతి కీపర్ డిక్వెలా చేతిలో పడి ఎగిరింది. స్లిప్లో ఉన్న తిరిమానె దాన్ని చక్కగా ఒడిసిపట్టాడు. సారథి విరాట్ కోహ్లీ (39బీ 59 బంతుల్లో 4ఐ4) అర్ధశతకానికి చేరువయ్యాడు. చక్కని బౌండరీలు బాదుతున్నాడు. రవి చంద్రన్ అశ్విన్ (0బీ 1 బంతుల్లో) బ్యాటింగ్కు వచ్చాడు. 66 ఓవర్లు ముగిసే సరికి భారత్ 249/5తో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm