వైసీపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా లో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ 13వ వార్డు కౌన్సిలర్ కాశి బాలమునికుమారికి అమలాపురం పార్లమెంటరీ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలి పదవి ఇటీవలే దక్కింది. ఆమెకు ఈ పదవి లభించడంపై కొమానపల్లి వైసీపీ నాయకుడు కాశి రామకృష్ణ ఆమెకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ లు పెట్టాడు. దీంతో, తీవ్ర మనస్తాపం చెందిన బాలమునికుమారి నిన్నఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముమ్మిడివరంలోని తన పుట్టింట్లో ఉన్న ఆమె ఈ ఘాతుకానికి పాల్పడటంతో, వెంటనే, బాలమునికుమారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు, ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, బాధితురాలు బాలమునికుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm