మెదక్: వివాహిత వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోనగిరి రమేష్ (23) అనే యువకుడు ఉపాధి కోసం దుబాయి వెళ్లి మూడు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో మనస్తాపం చెంది శనివారం దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతుడి తండ్రి మొండయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభిలాష్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm