మధుర: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఏడేళ్ల బాలుడు రెండు చిప్స్ ప్యాకెట్లివ్వలేదని ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి అతనికి ఒక చిప్ప్ ప్యాకెట్ ఇచ్చాడు. అయితే తనకు రెండు ప్యాకెట్లు కావాలని మొండిపట్టుపట్టాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఫరా పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీగా పనిచేసే పద్మసింగ్ తన పిల్లలకోసం ఐదు చిప్స్ ప్యాకెట్లు తెచ్చాడు. మగ్గురు పిల్లలకు మూడు ప్యాకెట్లిచ్చాడు. అయితే చిన్నకుమారుడు సౌరభ్ తనకు రెండు ప్యాకెట్లు కావాలని మారాం చేశాడు. దీంతో తండ్రి కోపగించుకుంటూ బాలుడిని కొట్టాడు. తరువాత తండ్రి ఆ విషయాన్ని మరచిపోయాడు. అయితే బయటకు వెళ్లిన సౌరభ్ దుస్తులను ఆరవేసుకునే తాడును తీసుకుని, దాని సాయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm