ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సయ్యద్ బాషం పచా అనే పోలీసు ఉద్యోగంలో ప్రాణాలను వదిలాడు. సయ్యద్ తన డ్యూటీలో ఉండగా ఓ పెద్ద హాల్ ముందుకు సూసైడ్ బాంబర్ పరిగెత్తుకొని వచ్చాడు. అందులో అప్పటికే కొన్ని వందల మంది ఉన్నారు. సూసైడ్ బాంబర్ ను చూసిన సయ్యద్ గట్టిగా అందరినీ హెచ్చరించాడు. వెంటనే ఆ సూసైడ్ బాంబర్ ను వెళ్ళి పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు. కౌగిలించుకునే సరికి సూసైడ్ బాంబర్ ఎక్కడికి పోవాలో తెలీలేదు. దీంతో వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో సయ్యద్ చనిపోవడమే కాకుండా మరో 12 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ సయ్యద్ అతన్ని వెళ్ళి గట్టిగా హత్తుకోకుండా ఉండి ఉంటే ప్రాణ నష్టం వందల్లో ఉండేదట..! ఆ లోపల హాల్ లో ఎందఱో విదేశాలకు చెందిన గెస్ట్ లు కూడా ఉన్నారట.. వారందరినీ కాపాడటానికి సయ్యద్ ఇలా తన ప్రాణాలను అర్పించాడు.
Mon Jan 19, 2015 06:51 pm