మధ్యప్రదేశ్: 'పద్మావతి' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమాపై రాజ్ పుత్ ల నిరసన జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఈ సినిమా యూనిట్ కు షాక్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో సినిమాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్ పుత్ వర్గానికి చెందిన నేతలు ఇటీవలే చౌహాన్ ను కలిసి సినిమాను నిషేధించాలంటూ విన్నవించారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల వాయిదా పడ్డప్పటికీ, నిషేధం విధించారు చౌహాన్. మరోవైపు, రాజ్ పుత్ లకు అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే సినిమాను అనుమతించబోమని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఇప్పటికే హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm