ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ వైపు దట్టమైన పొగమంచు.. మరో వైపు నిర్లక్ష్యమైన డ్రైవింగ్.. 17 మంది ప్రాణాలను బలిగొన్నాయి. బొగ్గు లోడ్తో వెళ్తున్న ట్రక్కు.. వ్యాన్ను ఓవర్టేక్ చేయబోయింది. దీంతో అదుపుతప్పిన ట్రక్కు.. వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికకక్కడే 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm