హైదరాబాద్: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ చివరి రోజున చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. 18వ ఓవర్ షమీ బౌలింగ్ చేస్తుండగా డిక్ వెల్లా స్ట్రైకింగ్ లో ఉన్నాడు. అప్పటికే వికెట్ ను కాపాడుకుంటూ వస్తున్న డిక్ వెల్లా ధమీ వేసిన గుడ్ లెంత్ బాల్ కు ఎడ్జ్ అయి ఫస్ట్ స్లిప్ లోకి వెళ్ళింది. అయితే అలా బాల్ వెళ్ళగానే డిక్ వెల్లా తన చేతులతో సంజ్ఞ చేస్తూ ఇంకా వెయ్.. వెయ్.. అంటూ మాట్లాడాడు. వెంటనే షామీ కూడా అతడి దగ్గరకు వెళ్ళి ఒకరి కళ్ళలో ఒకరు కోపం గా చూస్తూ ఉండిపోయారు. తర్వాతి బంతికి డిక్ వెల్లా ఎంత సేపు అయినా క్రీజులో నిలబడలేదు. సమయం కావాలనే వృధా చేస్తున్నాడని అనిపించడంతో కోహ్లీ అంపైర్ లకు ఫిర్యాదు చేశాడు. అంపైర్ లు డిక్ వెల్లాకు సర్ది చెప్పడంతో బ్యాటింగ్ కు వెళ్ళిపోయాడు. ఈ చిన్న పాటి గొడవ చివరి సెషన్ లో చోటుచేసుకుంది. తర్వాతి ఓవర్ లో షమీ అద్భుతమైన బంతితో చండిమాల్ ను బౌల్డ్ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm