హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కిందపడి, ఆ తర్వాత పుంజుకుని, గెలుపు అంచుల వరకు వెళ్లిన తొలి టెస్ట్ మ్యాచ్ అనూహ్యంగా డ్రాగా ముగిసింది. పేస్ బౌలర్లను ఎదుర్కొనేంత లైటింగ్ లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను ముగించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు మాత్రమే చేసింది. మరో 19 ఓవర్లు వరకు మిగిలి ఉన్నాయి. ఫలితం వచ్చే అవకాశం ఉంటే మాండేటరీ ఓవర్లు వేసే అవకాశం ఉంది. కానీ, వాతావరణం భారత్ కు అనుకూలించలేదు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో అప్పటిదాకా టెన్షన్ గా ఉన్న లంక ఆటగాళ్ల ముఖాల్లో చిరునవ్వులు వికసించాయి.
Mon Jan 19, 2015 06:51 pm