లండన్: ఇండియాలోని బ్యాంకులకు రూ.9000 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి లండన్ పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సోమవారంనాడు వెస్ట్రన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తాను సమర్పించిన సాక్ష్యాలే అందుకు నిదర్శమని కోర్టులో మాల్యా తన వాదన వినిపిస్తున్నారు. కాగా, ఈ కేసులో భారతదేశం తరఫున వాదనలు చేస్తున్న యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ గత అక్టోబర్ 3న మాల్యా మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన మరిన్ని సాక్ష్యాలను కోర్టుకు అందజేసింది. 2016 మార్చి 2న ఇండియా నుంచి పరారైన మాల్యా అప్పటి నుంచి లండన్లోనే తలదాచుకుంటున్నారు. కాగా, తాజాగా విచారణకు హాజరైన మాల్యా మరోసారి మీడియాతో ముక్తసరిగా మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి విచారమూ లేదని చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm