హైదరాబాద్: నంది అవార్డులపై వస్తోన్న వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ రోజు అమరావతిలో పలువురు మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి విషయానికి కులం రంగు పులిమి చూస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా జరుగుందని అనుకుంటే సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవారిమని ఆయన అన్నారు. నంది అవార్డుల విషయంపై ఇంతగా రచ్చ జరుగుతుందని అనుకోలేదని చెప్పినట్లు సమాచారం. ఎప్పటి నుంచో ఆనవాయితిగా వస్తోన్న సంప్రదాయం ప్రకారమే జ్యూరీ సభ్యులను నియమించి అవార్డు విజేతలను ఎంపిక చేశామని ఆయన అన్నట్లు తెలిసింది. నంది అవార్డుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధపడుతున్నట్లు మంత్రి లోకేశ్ ఈ రోజు మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm