హైదరాబాద్: ఉత్తరాఖండ్ జలాశయంలో గల్లంతైన ఐఐటీ విద్యార్థి నరేన్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని నగరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన నరేన్ (20) దిల్లీలోని ఐఐటీలో మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. ప్రస్తుతం నరేన్ తల్లిదండ్రులు హైదరాబాద్లోని మొజంజాహీ మార్కెట్లోఉంటున్నారు. ఇటీవల 8 మంది స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లిన నరేన్ సెల్ఫీ తీసుకుంటుండగా అక్కడి జలాశయంలో పడి గల్లంతయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉత్తరఖాండ్ వెళ్లారు. శనివారం జలాశయంలో గల్లంతైన నరేన్ మృతదేహాన్ని సుదీర్ఘ గాలింపు చర్యల అనంతరం సోమవారం వెలికి తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm