చెన్నై: విలక్షణ నటుడు కమల్హాసన్పై తమిళనాడు మంత్రి జయకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కమల్ ఎలాంటి ఆధారాల్లేకుండా తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆరోపణలు మానుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పబ్లిసిటీ కోసమే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కమల్ తన వాణిని విన్పించుకొనేందుకు అనేక వేదికలు ఉన్నాయని సూచించారు. 'దోపిడీలో ప్రభుత్వమే జోక్యం చేసుకోవడం నేరం. దాన్ని గుర్తించాక కూడా నిరూపించలేకపోవడం మరో నేరం. నేరగాళ్లు దేశాన్ని పాలించకూడదు. పనిచేయడం కోసమే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు కావాలి. అంతా జాగృతం కండి. మేల్కొనండి' అంటూ కమల్ హాసన్ తాజాగా చేసిన ట్వీట్పై మంత్రి పైవిధంగా స్పందించారు.
Mon Jan 19, 2015 06:51 pm