లూధియానా: పంజాబ్లోని లూధియానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ సంచులు తయారుచేసే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి భవనం కుప్పకూలి ముగ్గురు దుర్మరణం చెందారు. లూధియానాలోని ముస్తాఖ్నగర్లో గల ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సోమవారంఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 10 అగ్నిమాపక యంత్రాలతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఆ మూడంతస్తుల భవనంకుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో పలువురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm