హైదరాబాద్: మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చే ముస్లింల పద్ధతి సరైంది కాదంటూ సుప్రీంకోర్టు ఆ విధానాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ కొందరు తమ భార్యలకు తలాక్ చెబుతున్నారు. తనకు తన భర్త తలాక్ చెప్పాడని హైదరాబాద్లో ఓ ముస్లిం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, అథియా బేగం అనే ముస్లిం యువతికి షేక్ సర్దార్ మజర్తో ఈ ఏడాది అక్టోబర్ 18న పెళ్లి జరిగింది. అనంతరం సదరు భర్త దుబాయ్ వెళ్లిపోయాడు. ఈ నెల 13న అథియా బేగంకి ఫోన్ చేసి తలాఖ్ చేప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm