హైదరాబాద్: తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, సాహితీ మూర్తులు ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సాహిత్య సృజన, సాహిత్య పటిమపై ఈ సమావేశాల్లో చర్చ జరగాలని, సాంస్కృతిక కార్యక్రమాలకు, కళలకు తగిన ప్రాధాన్యం ఉండాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm