హైదరాబాద్: నగరంలో పాలపిట్ట సైక్లింగ్ పార్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి సైక్లింగ్ చేస్తూ సందడి చేశారు. కొత్తగూడలో బోటానికల్ పార్క్ ఎదురుగా అటవీశాఖ ఏర్పాటు చేసిన పాలపిట్ట పార్క్ విస్తీర్ణం 46 ఎకరాలు. సైక్లింగ్ కోసం పార్క్లో దాదాపు 3 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుతోందని మంత్రి అన్నారు. సైక్లింగ్ ట్రాక్తో పాటు వాకింగ్ ట్రాక్ కూడా తయారు చేయబోతున్నామని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm