చండీగఢ్: భారీ బడ్జెట్తో దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించినచిత్రం ాపద్మావతి్ణ. దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ ప్రధాన తారాగణంగా నటించారు. దీన్ని రాజ్పుత్ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ చిత్రం విడుదలకు మార్గం సుగమనం కాకపోగా.. మరిన్ని చిక్కులు పడుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో నిషేధించారు. 'పద్మావతి' తమ రాష్ట్రంలో విడుదల కాదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి చూపిస్తున్నారని, కాబట్టి తమ రాష్ట్రంలో సినిమా విడుదలకు ఒప్పుకోమని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 20,2017 08:36PM