విజయవాడ: సినీ నటుడు జగపతిబాబు విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ ప్రాంతంలో సందడి చేశారు. అభిమానులతో కలిసి కాసేపు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు కొత్తగా వస్తున్న కథానాయకులను, నాయికలను ప్రోత్సహించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్య ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న సినిమాలు అంతరించిపోకుండా విజయాలు సాధించాలన్న ఆకాంక్షతో నడక నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు రేపు హైదరాబాద్లో నిర్వహించే పాదయాత్ర అనంతరం చెబుతానని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm