గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులోని రైల్వే డివిజినల్ కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు. తిరుపతికి చెందిన కాంట్రాక్టరుకు బిల్లులను చెల్లించడానికి ఉద్యోగి డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టరు సీబీఐని ఆశ్రయించాడు. ముందస్తు పథకం ప్రకారం కాంట్రాక్టరు నుంచి సదరు ఉద్యోగి కార్యాలయంలో రూ.15వేలు లంచం తీసుకుంటున్న సమయంలో సీబీఐ అధికారులు దాడులుచేసి పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm