సికింద్రాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (12713/12714)కు అదనంగా ఓ సెకండ్ సిట్టింగ్ బోగీ అమర్చుతున్నట్టు తెలిపింది. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్న ఈ బోగీతో రైలు ప్రయాణికులకు కొంత వెసులుబాటు లభిస్తుందని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ నిర్ణయం వెంటనే అమలవుతుందని ఆయన వివరించారు
Mon Jan 19, 2015 06:51 pm